పల్లవి:దేవపుత్రులందఱు ఎంతో భాగ్యవంతులు పాప మరణాదులు పరిహారమాయెను. ||నేను నట్టివారితో పాలు పొందవలెను||
1. వారు క్రీస్తువల్లనే ఐరి నీతిమంతులు స్ధిరమైన నెమ్మది భక్తులందరొందరి.
2. తండ్రి యొద్ద పిల్లలు నిర్భయాళులౌదురు వారు కూడ దేవునిన్ చేర భయపడరు.
3. వారి కెట్టి కష్టముల్ హానిచేయ నేరవు వారికిన్ నిజంబుగా శ్రమ యుపయోగము
4. ఇహమందు కరుణ చావువేళ నెమ్మదిది పరమందు భాగ్యము వారికిన్ సంపూర్ణము.
