కీర్తనలు

464. దేవుని పనియు, మనుష్యుని పనియు

రాగం: గౌళిపంతు|తాళం: ఆది|రచయిత: జుటికె దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యెహోవయే నా మహాదేవుఁడని బహుగ నెఱిఁగి మన నావంతు సహదాసులతో మహి నొకఁడనని సహాయ మిడుటే నీవంతు ||యెహోవా||
1.  మితిమిఱిన దు రిత సమూహముల క్షత మొనర్ప మన నావంతు పతితపావనుని క్షతజనములో నను నుతికి కడుగుటె నీవంతు ||యెహోవా||
2.  ప్రతిదిన బ్రతుకును మతి నుంచుచు నిను స్తుతి యొనర్చుటే నావంతు క్షితినేఁబడుదు ర్వెతల నుండ శా శ్వతముఁ బ్రోచుటె నీవంతు ||యెహోవా||
3.  చంచల మతిఁదొల గించుమంచుఁ బ్రా ర్థించుచుండుటే నావంతు అంచి తాత్మనిఁకఁ బంచి స్ధిరతను బెంచుచుండుటే నీవంతు ||యెహోవా||
4.  యేసు సిలువలో నే సంధించి గాసి సహించుట నావంతు భాసురమోక్ష ని వాసమునకు నను దీసుకపోవుటే నీవంతు ||యెహోవా||
5.  మేటి వార్త నా బోటి జనాళికి ఁ జాటించుటయే నావంతు చాటిన దానిని గాటముగ మది నాటించుటయే నీవంతు ||యెహోవా||
6.  అనుదిన మబలుఁడ నని మదినిం గనుఁ గొని బ్రదుకుటయే నా వంతు ననుఁ బదాబ్జప జ్జనుఁ జేర్చియు బల మును గృప నిచ్చుటే నీవంతు ||యెహోవా||
7.  ముదముతోడ నీ తుదిరాక కొఱకు నెదురు చూచుటే నావంతు సదమలాత్మచే హృదయమును సదా పదిలపఱచునటే నీవంతు ||యెహోవా||