పల్లవి:శరణు నా యేసు ప్రభువా నీవెగా పరలోకమునకుఁ ద్రోవ కరుణతో నన్నుఁ గావ నీ కన్న గర్త యెవ్వఁడు యేసువా ||శరణు||
1. పర సుఖము విడిచినావు కన్యక మరియగర్భమున నీవు ధరణి నుదయించినావు నీ కన్న దాత యెవ్వఁడు యేసువా ||శరణు||
2. పాపభారము క్రిందను బడి యున్న పాపాత్ములను నెల్లను జేఁపట్టి రక్షింపఁగా నీ కన్న శ్రేష్ఠుఁ డెవ్వఁడు యేసువా ||శరణు||
3. మరణమై లేచినావు జీవింప మార్గంబుఁ జూపినావు పరమహిమ జూపినావు నీ కన్నఁ ప్రభుఁ డెవ్వఁడు యేసువా ||శరణు||
