కీర్తనలు

299. యేసునాధ కథా మాధుర్యము

రాగం: బిలహరి|తాళం: త్రిపుట|రచయిత: పురుషోత్తము చౌదరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు నాథ కథా సుధా రస మిదిగో పానముఁ జేయరే దోసకారి జనంబులారా దురిత భవముల బాయరే ||యేసు||
1.  ఇహపరంబు లెవనిచే సృజి యింపఁబడియెనొ చూడరే అసహహ యా విభుఁ డవతరించెను అతని గుణములఁ బాడరే ||యేసు||
2.  దురిత భరితుల దుష్ట చరితుల నరయ వచ్చెను జూడరే స్థిరముగామది నమ్మి యా ప్రభు కరుణ మదిఁ గొనియాడరే ||యేసు||
3.  పనికిమాలిన వేలుపుల దెస పరుగు లెత్తుట మానరే తనువు మీ కొఱ కిచ్చు క్రీస్తుని దయకుఁ బాత్రతఁ బూనరే ||యేసు||
4.  మరణ బలి రక్తమున మన యం దఱిని బ్రోవను వచ్చెను కరుణతోఁ బాపులఁ బిలుచు గురు దరికిఁబోవుద మిచ్ఛను ||యేసు||
5.  పరమతత్వ విధాన బోధలు బాగుగఁ బ్రకటించెను చిరసుఖాస్పద పదముఁ గోరిన జీవులకు వినిపించెను ||యేసు||
6.  మరణ మొందిన కొందఱికిఁ దా మరలఁ బ్రాణము లిచ్చెను వర మహాద్భుత కార్యముల ని ద్ధర ననేక మొనర్చెను ||యేసు||
7.  కుటిల బుద్ధుల ద్రోచి సజ్జన గోష్టి నుండుట గోరరే దిటముగను నెమ్మదిని మీరొం దుటకుఁ క్రీస్తునిఁ జేరరే ||యేసు||