పల్లవి:ఓ సద్భక్తులారా ! లోకరక్షకుండు బెత్లెహేమందు నేఁడు జన్మించెన్ రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింప రండి నమస్కరింప రండి. నమస్కరింప రండి యుత్సాహముతో.
1. సర్వేశ్వరుండు నరరూప మెత్తి కన్యకుఁ బుట్టి నేఁడు వేంచేసెన్ మానవ జన్మ మెత్తిన శ్రీ యేసూ నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము.
2. ఓ దూతలారా! ఉత్సహించి పాడి రక్షకుండైన యేసున్ నుతించుఁడి పరాత్పరుండా నీకు స్తోత్ర మంచు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతో
3. యేసూ! ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నర్పింతుము అనాది వాక్య మాయె నరరూపు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతో
