కీర్తనలు

472. ధన్యతలు

రాగం: భైరవి|తాళం: ఆది|రచయిత: విలియం డాసన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వారు భాగ్యవంతు లౌదురు భూ లోకమందు వారు భాగ్యవంతులౌదురు చారు శుభవార్తా రవంబు గోరి యాకర్ణించి భక్తి మీరఁ దెలిసికొనిన యట్టి ధీరు లెవ్వ రెవ్వరో ||వారు||
1.  వారు నడుచు మార్గమందున సుక్షేమ రాజి వారి ననుసరించు నెందును తేరి చూడ రాని దే దీప్యమాన దివ్యసత్య భూరి తేజ మాజనములఁ బొలుపు మీరఁ జుట్టుకొనును ||వారు||
2.  విమోచకుని నామమందున దజ్జనంబుల విశ్రుతానందంబు ప్రాణముల అమందముగ హెచ్చరించు నతని నీతి రీతిఁ దజ్జ నముల కోర్కె వృద్ధి బొం దంగఁ జేయు సంతతంబు ||వారు||
3.  నరులపై బిశాచమును నిందా స్థాప నంబు జేయంగలేదు పరగు ప్రకాశమును బ్రాపు నైన సర్వే శ్వరుఁడు బలము రక్షయు న వారితముగ మనకు నిచ్చు ||వారు||
4.  వరగుణ ప్రశస్తులారా క్రైస్తవులారా వన్నె మీర మీ రాజు సురుచిరముగ శాశ్వతముగఁ పరిపాలించు మీ దేవుఁడు నిరతముగను జీవించు నీతి భరిత చిత్తుఁడగుచు ||వారు||