పల్లవి:
యేసు శిష్యులకు నెరుక జేసిన భవిష్యోక్తులు వినరే కైసరయన గర ప్రాంతములను ఘనుఁడు చేరి తన గతి మతిఁ దలఁచుచు ||యేసు||
1. యెరూషలే మనెడి పురమునఁ దన కిఁక కలిగెడు దుఃఖములు దురితాత్ములు యూ దులు కడు బాధలు పరచి తన్ను సిలు వను చంపుదు రని ||యేసు||
2. నీతి బోధకు ల నేకులు పెద్దలు ఖ్యాతిగ నర్చకులు అతరిఁదన నప హాస్యము లాడుచుఁ బోతరించి యుమి వేతుర టంచును ||యేసు||
3. మనుజ కుమారుఁడు మరణమై సమా ధిని వేయంగఁబడున్ దన రఁగ మూఁడవ దినమునఁ బునరు త్థానమొంది ద ర్శన మిడు మీకని ||యేసు||
